కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వేళ కాంట్రాక్టు ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్న్యూస్ వినిపించారు. ఎన్నో రోజులుగా ఉద్యోగ క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరింది. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం రోజు వాళ్ల ఆశ తీరింది. కొత్త సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని మొత్తం 40 విభాగాల్లోని 5 వేల 544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసినందుకు గానూ.. సీఎం కేసీఆర్కు మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారంటూ హరీశ్ రావు ట్వీట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
సర్కారు నిర్ణయంతో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సర్కారు నిర్ణయంతో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లు, 390 మంది పాలిటెక్నిక్, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Read More Telangana News And Telugu News