యాప్నగరం

ప్రగతి భవన్‌కు వీహెచ్.. అపాయింట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్

ముఖ్యమంత్రిని కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రగతి భవన్‌కు వెళ్లారు. అయితే కేసీఆర్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో సీఎంను కలవకుండానే వెనుతిరిగారు.

Samayam Telugu 29 May 2021, 11:28 am
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు నేడు ప్రగతి భవన్‌కి వెళ్లారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఆయన ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్‌ను క‌లుద్దామంటే ఆయ‌న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిప‌డ్డారు. కరోనాతో చనిపోయిన వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu వీ. హనుమంతరావు


ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని వీహెచ్ పేర్కొన్నారు.అయినా కూడా సమస్యలపై తన పోరాటం ఆగదన్నారు వీహెచ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.