కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలపై ఆయన అసహనం వెళ్లగక్కారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయన శనివారం ఎలిమినేషన్కు గురయ్యారు. అనంతరం చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులు సైతం టీఆర్ఎస్కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోందని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బులు పంచలేకపోవటం వల్లే తనకు ఓట్లు పడలేదని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సురభి వాణిదేవి గెలుపు సంబరాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు అడ్డగోలుగా పంచాయని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు లేనిదే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. డిగ్రీ చదవని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. డబ్బు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దని ఆయన కోరారు.
తన పలుకుబడి 32 వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానని, డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్ను భవిష్యత్లో ఎవరు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను తట్టుకోగలరని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని ఆయన తెలిపారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సురభి వాణిదేవి గెలుపు సంబరాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు అడ్డగోలుగా పంచాయని చిన్నారెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు లేనిదే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. డిగ్రీ చదవని వాళ్లకు ఓటు హక్కు కల్పించారని.. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. డబ్బు లేకపోతే ఎవరు కూడా ఎన్నికల్లో పోటీచేయవద్దని ఆయన కోరారు.
తన పలుకుబడి 32 వేల ఓట్లకే పరిమితం అనుకుంటున్నానని, డబ్బు ఖర్చు చేయటంలో కేసీఆర్ను భవిష్యత్లో ఎవరు తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను తట్టుకోగలరని చిన్నారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని ఆయన తెలిపారు. తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని చిన్నారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సురభి వాణిదేవి గెలుపు సంబరాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి