యాప్నగరం

మార్నింగ్ వాక్‌కు వెళ్లి .. హెడ్ కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుల్ సూర్యనారాయణ మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ వాకింగ్ చేస్తుండగా అతనికి గుండె నొప్పి వచ్చింది. దీంతో అక్కడే అతను కుప్పకూలిపోయాడు.

Samayam Telugu 28 Jul 2021, 9:35 am

ప్రధానాంశాలు:

  • కేబీఆర్ పార్క్‌లో విషాదం
  • మార్నింగ్‌కు వాకింగ్ వెళ్లిన హెడ్ కానిస్టేబుల్
  • గుండెనొప్పి రావడంతో మృతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్ కోసం వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందారు.. కేటీఆర్ పార్క్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కెబిఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ కు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ గుండెలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే 108కి సమాచారాన్ని అందించారు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే అతడు మృతి చెందాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కానిస్టేబుల్ సూర్యనారాయణగా గుర్తించారు. ఇతను సిఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అతను మరణించిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అతని మరణం వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.