యాప్నగరం

పోలీసు కుటుంబాల్లో విషాదం.. కానిస్టేబుల్ భార్య, హోంగార్డు ఆత్మహత్య

వేరే వేరే కారణాలతో పోలీస్ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ వైపు కానిస్టేబుల్ భార్య... మరో వైపు హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 13 Apr 2021, 8:48 am
పోలీస్‌ కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ భార్య, మరోవైపు హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... మంచిరేవుల గ్రేహౌండ్స్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ కృష్ణ ప్రసాద్‌, మంచిరేవుల గ్రామంలో అద్దెకుంటున్నాడు. ఇతనికి ప్రశాంతి (35)తో 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. సోమవారం సాయంత్రం ప్రశాంతి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కనే ఉన్న స్థానికులు గమనించి వెంటనే ఆమె భర్తకు సమాచారం అందించారు. ప్రశాంతి సోదరుడు జి ప్రవీణ్‌ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu పోలీస్ కుటుంబాల్లో విషాదం


మరోవైపు రాజేంద్రనగర్ గండిపేట మండలం నార్సింగీలో విషాదం చోటు చేసుకుంది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి పై కప్పు రాడుకు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు హోం గార్డు. అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డబ్బులు పెట్టుకొని స్థోమత లేక ఆత్మహత్య కు చేసుకున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.