యాప్నగరం

TRS ఎంపీ కవితకు జైలు శిక్ష.. ఆ కేసులో నేరం రుజువు, జరిమానా కూడా..

Mahabubabad MP: 2019 ఎన్నికల సమయంలో ఆమె సహచరుడు షౌకత్ అలీ, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కం పట్టుబడ్డాడు. ఎంపీ కవిత ఆదేశానుసారమే ఓటర్లకు డబ్బులను పంపిణీ చేసినట్లు అతను కోర్టులో ఒప్పుకున్నాడు.

Samayam Telugu 24 Jul 2021, 5:48 pm
టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కేసు విషయంలో ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్లకు డబ్బులు పంచారని బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది.
Samayam Telugu మాలోతు కవిత (ఫైల్ ఫోటో)
mp maloth kavitha


2019 ఎన్నికల సమయంలో ఆమె సహచరుడు షౌకత్ అలీ, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కం పట్టుబడ్డాడు. ఎంపీ కవిత ఆదేశానుసారమే ఓటర్లకు డబ్బులను పంపిణీ చేసినట్లు అతను కోర్టులో ఒప్పుకున్నాడు. అయితే, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లుగా నిర్ధారణ కావడంతో కవితకు 6 నెలల జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజా ప్రతిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎంపీ కవిత రూ.10 వేల జరిమానా చెల్లించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.