యాప్నగరం

మాజీ మంత్రి అఖిలప్రియకు మరో షాక్.. అప్పటి వరకూ ఆగాల్సిందే!!

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడలేదు. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

Samayam Telugu 16 Jan 2021, 7:06 pm
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ ఆమె తరఫు లాయర్లు హెల్త్ రిపోర్టులను కోర్టుకు సమర్పించారు. అయినా ఆమెకు బెయిల్ మంజూరు చేసే విషయంపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిపి నిర్ణయం వెలువరించే అవకాశముంది.
Samayam Telugu భూమా అఖిల ప్రియ
akhila priya


అయితే ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిలప్రియ ఒకసారి బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆమె బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని.. ఆమెకు బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అనంతరం ఆమె ఆరోగ్యం బాలేదని.. చికిత్స కోసమైనా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాదులు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సదరు పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులు కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేయడం గమనార్హం

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.