యాప్నగరం

Cyber F​​raud: వారం రోజుల్లో కోటి స్వాహా.. ఆ యాప్ మీరు వాడుతున్నారా?, అయితే జాగ్రత్త!

Cyber Crimes: సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుతం తరుణంలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులు, అత్యాశాపరులే లక్ష్యంగా పెట్రేగిపోతున్నారు. రోజుకో కొత్త అవతారం ఎత్తి అందినకాడికి దోచుకుంటున్నారు. మోసపూరిత సందేశాలు, లింకులు, లాటరీల ఆశ చూపిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలు లూటీ చేసి తప్పించుకుంటున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 26 Apr 2023, 12:02 pm
Cyber Crimes In Hyderabad: కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మనిషి ఆశను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. భారీ డిస్కాంట్‌లు, కాస్ట్లీ గిఫ్ట్‌ల పేరుతో వలవేసి అమాయకులు నిండా ముంచుతున్నారు. ఒక్క క్లిక్‌తో వేల‌ల్లో, లక్షల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు తాము మోసపోయామ‌ని తెలిసే లోపే అంతా జ‌రిగిపోతుంది. రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
Samayam Telugu Cyber Crimes
హైదరాబాద్‌లో సైబర్ మోసం


హైదరాబాద్‌లో కేవలం వారం రోజుల్లోనే సైబర్ కేటుగాళ్లు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు కాజేశారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అమాయకులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే ప్రమోషన్ ప్రకటనలు, ఫోన్ కాల్స్ నమ్మిన అమాయకమైన జనం లక్షల్లో డబ్బులు వారికి టాన్స్‌ఫర్ చేసి నిలువు దోపిడీకి గురవుతున్నారు.

ఇలా కేవలం వారం రోజుల్లోనే అమాయకుల నుంచి కోటి రూపాయలు కాజేసినట్లు హైదారాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు బాధితుల నుంచి పలు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మేసెజ్‌లు, ప్రకటనలు నమ్మెుద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

మరీ ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ యూజర్స్ అప్రమత్తంగా ఉంటాలని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో టెలిగ్రామ్ యాజర్లే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అలాంటి లింకులు ఓపెన్ చేసిన పలువురు లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారని.. వీటి విషయంలో యూజర్లు అలెర్టుగా ఉండాలని సూచించారు. సైబర్ క్రిమినల్స్ ట్రాప్ చేయటానికి ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.