యాప్నగరం

Durgam Cheruvu: కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి అతి.. కట్ చేస్తే.!! మైండ్ బ్లాంక్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలు అన్నీఇన్నీకావు. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా బైకులతో విన్యాసాలు చేస్తున్నారు. అది గమనించిన సైబరాబాద్ పోలీసులు ఊహించని షాకిచ్చారు.

Samayam Telugu 11 Aug 2021, 9:30 pm
హైదరాబాద్‌కే టూరిస్ట్ స్పాట్‌గా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆకతాయిల ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. బ్రిడ్జిపై వాహనాలు ఆపేందుకు వీల్లేదని.. ఫొటోలు, వీడియోలు తీస్తూ ప్రమాదాల బారిన పడొద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొందరి చెవికెక్కడం లేదు. బ్రిడ్జిపై వాహనాలు ఆపి విన్యాసాలు చేస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు అర్ధరాత్రి వేళ కేబుల్ బ్రిడ్జిపై అతి చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఎవరూ చూడడం లేదని బైకులతో విన్యాసాలు చేసి దొరికిపోయారు.
Samayam Telugu ఆకతాయిల ఆగడాలు
cable bridge


మైక్‌లో పోలీసులు వెళ్లిపోవాలని చెబుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. అర్ధరాత్రి అతి చేస్తున్న ఆకతాయిలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కొద్దినిమిషాలకే ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా వాహనాలు నిలపకూడదని.. ప్రయాదకర విన్యాసాలు చేయకండి అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆకతాయిల వీడియో షేర్ చేశారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని హితవు పలికారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.