Hyderabad: యూట్యూబ్ లైక్స్ పేరుతో రూ.65 లక్షలు కాజేశారు
Hyderabad: ఇటీవల కొత్త తరహా సైబర్ మోసాలు వెలుగులోకి వస్తోన్నాయి. తాజాగా యూట్యూబ్ లైక్స్ పేరుతో హైదరాబాద్కి చెందిన ఓ వ్యక్తి నుంచి కేటుగాళ్లు రూ.65 లక్షలు దొచుకున్నారు. అలాగే ఆన్లైన్లో అమెజాన్ ఒచర్స్ పేరుతో మరో వ్యక్తి నుంచి రూ.34 లక్షలు కొల్లగొట్టారు.
ప్రధానాంశాలు:
- వెలుగులోకి కొత్త తరహా సైబర్ మోసం
- యూట్యూబ్ లైక్స్ పేరుతో రూ.65 లక్షలు కాజేసిన వైనం
- అమెజార్ వోచర్స్ పేరుతో రూ.34 లక్షలు కొల్లగొట్టారు
Hyderabad: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది మోసపోతున్నారు. మాయమాటలు చెప్పి కొత్త పంథాలో సైబర్ నేరానికి పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కొంతమంది వీరి మాటలు నమ్మి మోసపోతున్నారు. తాజాగా ఒక కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో లైక్స్, వెబ్సైట్స్లో గిఫ్ట్ వోచర్స్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్కి చెందిన కొంతమంది వీరి మాయలో పడి లక్షల్లో డబ్బులు పొగోట్టుకున్నారు. యూట్యూబ్లో ఒక్కో లైక్కి రూ.50 ఇస్తామని హైదరాబాద్లోని ఆసిఫ్నగర్కి చెందిన ఓ వ్యక్తిని చీటర్స్ నమ్మించారు. ఇందులో భాగంగా తొలుత కొంత డబ్బులు పెట్టించి లాభాలు చూపించారు. దీంతో బాధితుడు ఆశపడి విడతల వారీగా భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇలా బాధితుడు నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.65 లక్షలు కాజేశారు. చివరికి డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గమనించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇక బర్కత్పురకి చెందిన ఓ వ్యక్తిని ఆన్లైన్ అమెజాన్ వోచర్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసగించారు. వెబ్సైట్ నుంచి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ కొంటానని చెప్పి డబ్బులు కాజేశారు. రెండు నెలల కాలంలో దాదాపు రూ.34 లక్షల విలువ చేసే గిఫ్ట్ ఒచర్స్ కేటుగాళ్లు కాజేశారు. ఇలా ఒకేరోజు నగరంలో సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.99 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇలాంటి వాటిని నమ్మి ఎవరూ మోసపోవద్దని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక బర్కత్పురకి చెందిన ఓ వ్యక్తిని ఆన్లైన్ అమెజాన్ వోచర్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసగించారు. వెబ్సైట్ నుంచి అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ కొంటానని చెప్పి డబ్బులు కాజేశారు. రెండు నెలల కాలంలో దాదాపు రూ.34 లక్షల విలువ చేసే గిఫ్ట్ ఒచర్స్ కేటుగాళ్లు కాజేశారు. ఇలా ఒకేరోజు నగరంలో సైబర్ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.99 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇలాంటి వాటిని నమ్మి ఎవరూ మోసపోవద్దని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.