యాప్నగరం

చెట్టు నుంచి రాలిన కుళ్లిన శవం.. షాకింగ్

మేడ్చల్‌కి చెందిన ప్రకాష్ కనిపించడం లేదని ఆయన భార్య ఈ నెల మొదటి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనూహ్యంగా అతని శవం ఊరి శివారులోని చింత చెట్టు కింద కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.

Samayam Telugu 27 Aug 2021, 4:00 pm
తెలంగాణలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా కనిపించకుండా ఓ వ్యక్తి అనూహ్యంగా రోడ్డు పక్కన శవమై తేలాడు. అదీ శవం కుళ్లిపోయి చింతచెట్టు నుంచి రాలిపోయాడు. చనిపోయి పదిరోజులకి పైగానే కావడంతో శవం పాడైపోయి చెట్టు నుంచి తెగి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ అత్యంత విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడ్చల్ పట్టణంలోని అత్వెల్లికి చెందిన గడ్డం ప్రకాష్ అనే వ్యక్తి ఈ నెల ఒకటో తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఆయన భార్య ఈ నెల 6 వ తేదీన తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tamarind tree


అనూహ్యంగా ఈ రోజు అత్వెల్లి సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీ వద్ద రోడ్డు పక్కన శవమై కనిపించాడు. చింత చెట్టు కింద శవం పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతుడిని ప్రకాష్‌గా గుర్తించారు. అతను చింతచెట్టుకి ఉరి వేసుకుని ఉండొచ్చని.. చనిపోయి పది రోజులకు పైగా కావడంతో శవం కుళ్లిపోయి చెట్టు నుంచి రాలి పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చెట్టుకి ఉరేసుకుని పది రోజులు దాటుతున్నా కనీసం ఎవరూ గుర్తించలేకపోవడం.. శవం కుళ్లిపోయి రాలిపడిపోవడం స్థానికులను కలచివేసింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.