యాప్నగరం

వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు నడుస్తున్నాయి. అయితే.. వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అమలు చేయకుండా మాట మారుస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. వంద రోజుల్లో రుణమాఫీ చెప్పలేదని.. కానీ అందుకు కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క్ చెప్పుకొచ్చారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 19 Apr 2024, 8:57 pm
Bhatti Vikramarka: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో గేరు మార్చింది. ఇప్పటికే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని.. ఇక మిగిలినవి కూడా లోక్ సభ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని చెప్తున్నారు. కాగా.. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఏ ఒక్క హామీ అమలు చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. అందుకు.. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తూ.. అమలు చేయని హామీల గురించి ఓ క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. రైతు రుణమాఫీ అమలు గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu Bhatti Vikramarka on rythu runa mafi
రైతు రుణమాఫిపై భట్టి విక్రమార్క


వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని తాము అనలేదని.. కానీ రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని వివరించారు. ముందుగా.. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని పేర్కొన్నారు. మేడిగడ్డ కూలింది అంటే.. దాంట్లో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల సొమ్ము ఉందని.. ఆ విషయం ప్రజలకు తెలియకూడదా.. అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రమాదకరమని.. ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారంటూ భట్టి మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేశారని కీలక ఆరోపణలు చేశారు భట్టి. ఫోన్లు విని బ్లాక్ మెయిల్ చేయటమనేది తప్పు కాదా.. అని భట్టి ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఎవరికైనా సమస్య వస్తే.. తన దృష్టికి తీసుకురావాలని.. వెంటనే పరిష్కారించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అలాంటి వారిపై కేసులు పెడతామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వాన్ని.. ఏడాది కూడా ఉండదని కేసీఆర్ ఏవేవో అంటున్నాడని.. తలకిందులుగా తప్పస్సు చేసినా కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.