హైదరాబాద్లోని అంబర్పేట పరిధిలో వీధి కుక్కల దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడి ఘటన.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ కూడా ముందు నుంచి ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందిస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా.. సర్కారుతో పాటు జంతు ప్రేమికులపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ట్విట్ల వర్షం కురిపించారు. ప్రదీప్ మృతి చెందిన ఘటనపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రజలందరి తరఫున.. ఐదు ప్రశ్నలు ఎక్కుపెట్టి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఆర్జీవీ ఎక్కుపెట్టిన ప్రశ్నలకు నెటిజన్ల నుంచి కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. నెటిజన్లంతా.. సర్కారుపై ఒత్తిడి పెంచాలని.. ప్రదీప్ లాంటి మరో చిన్నారి బలి కాకముందే.. తాను ఎక్కుపెట్టిన ప్రశ్నలకు ఒక్కోదానికి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు విడిచిపెట్టొద్దంటూ.. ట్విట్టర్ వేదికగా పిలుపు కూడా ఇచ్చారు ఆర్జీవీ. సర్కారుపై ఆర్జీవీ ఎక్కుపెట్టిన ప్రశ్నలేంటంటే..
1. ప్రజలు సురక్షితంగా బయట తిరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలేంటీ.. మా మధ్య మేం చర్చిస్తున్నాం.. అనటం సమాధానం కానే కాదు. ఎందుకంటే.. బయట కుక్కలు జనాలకు పీక్కు తింటున్నాయి.
2. పిల్లలను చంపడం కంటే కుక్కల సంరక్షణ చాలా ముఖ్యం అని మీరు విశ్వసిస్తే, అన్ని వీధి కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్లకు తీసుకెళ్లటం కంటే.. వాటిని దత్తత తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తే సరిపోతుంది. వీధి కుక్కలను స్వచ్ఛందంగా దత్తత తీసుకోవాలని ప్రజలను కోరడం ఓ మూర్ఖత్వమైన పని.
3. నాలుగు కోట్లకు పైగా ఉన్న వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం దగ్గర వనరులు లేవనుకుంటే.. తమని తాము చూసుకునేందుకే కష్టంగా ఉందని భావిస్తే.. కుక్కల ప్రేమికులు ఎందుకని వాటి సంరక్షణ కోసం టాక్స్ రూపంలో డబ్బు చెల్లించకూడదు..
4. వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్టెరిలైజేషన్ ప్రక్రియ.. దీర్ఘకాలికమైనది. దాని ద్వారా ఫలితాలు చాలా ఆలస్యం అవుతాయి. కానీ.. మేం మాట్లాడుతుంది ప్రస్తుతం మనుషులను చంపుతున్న కుక్కల సంగతేంటి.
5. నాలుగు సంవత్సరాల బాలున్ని కోల్పోయి.. బాధిత కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించినదానికి ప్రభుత్వం ఎంత పరిహారం చెల్లించబోతోంది.. మేయర్ గద్వాల విజయలక్ష్మి లాంటి బాధ్యత గల ప్రముఖులు స్వతహాగా ఇంకెంత నగదు సాయం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. నాలుగేళ్ల చిన్నారి మృతిపై కావేటి శ్రీనివాస్ అనే వ్యక్తి.. జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, భారత ప్రభుత్వంపై దావా చేయనున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం.. చట్టబద్ధమైన విధిని విస్మరించడం, నేరపూరిత నిర్లక్ష్యం, దుర్మార్గపు బాధ్యత, జీవించే రాజ్యాంగ హక్కును ఉల్లంఘించినందుకు గానూ ఈ దావా వేస్తున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు.
1. ప్రజలు సురక్షితంగా బయట తిరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలేంటీ.. మా మధ్య మేం చర్చిస్తున్నాం.. అనటం సమాధానం కానే కాదు. ఎందుకంటే.. బయట కుక్కలు జనాలకు పీక్కు తింటున్నాయి.
2. పిల్లలను చంపడం కంటే కుక్కల సంరక్షణ చాలా ముఖ్యం అని మీరు విశ్వసిస్తే, అన్ని వీధి కుక్కలను పట్టుకుని డాగ్ షెల్టర్లకు తీసుకెళ్లటం కంటే.. వాటిని దత్తత తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తే సరిపోతుంది. వీధి కుక్కలను స్వచ్ఛందంగా దత్తత తీసుకోవాలని ప్రజలను కోరడం ఓ మూర్ఖత్వమైన పని.
3. నాలుగు కోట్లకు పైగా ఉన్న వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం దగ్గర వనరులు లేవనుకుంటే.. తమని తాము చూసుకునేందుకే కష్టంగా ఉందని భావిస్తే.. కుక్కల ప్రేమికులు ఎందుకని వాటి సంరక్షణ కోసం టాక్స్ రూపంలో డబ్బు చెల్లించకూడదు..
4. వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్టెరిలైజేషన్ ప్రక్రియ.. దీర్ఘకాలికమైనది. దాని ద్వారా ఫలితాలు చాలా ఆలస్యం అవుతాయి. కానీ.. మేం మాట్లాడుతుంది ప్రస్తుతం మనుషులను చంపుతున్న కుక్కల సంగతేంటి.
5. నాలుగు సంవత్సరాల బాలున్ని కోల్పోయి.. బాధిత కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించినదానికి ప్రభుత్వం ఎంత పరిహారం చెల్లించబోతోంది.. మేయర్ గద్వాల విజయలక్ష్మి లాంటి బాధ్యత గల ప్రముఖులు స్వతహాగా ఇంకెంత నగదు సాయం చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. నాలుగేళ్ల చిన్నారి మృతిపై కావేటి శ్రీనివాస్ అనే వ్యక్తి.. జీహెచ్ఎంసీ, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ, భారత ప్రభుత్వంపై దావా చేయనున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం.. చట్టబద్ధమైన విధిని విస్మరించడం, నేరపూరిత నిర్లక్ష్యం, దుర్మార్గపు బాధ్యత, జీవించే రాజ్యాంగ హక్కును ఉల్లంఘించినందుకు గానూ ఈ దావా వేస్తున్నట్టు ఆర్జీవీ ట్వీట్ చేశారు.
- Read More Telangana News And Telugu News