తాగు నీరుకు బదులు మురికి నీరు.. రహమత్ నగర్లో ప్రజల అవస్థలు
నీటి సరఫరా బోర్డు పద్ధతిని మార్చలేదని ఆరోపిస్తున్నారు. పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అదే విధంగా సరఫరా చేస్తే నీటి బోర్డుకు సమాచారం ఇచ్చిందన్నారు. సురక్షితమైన తాగు నీరు అందివ్వాలని కోరుకున్నారు.
Samayam Telugu 28 Jul 2021, 9:34 am
ప్రధానాంశాలు:
- తాగు నీరుకు బదులు మురికి నీరు
- రహమత్ నగర్లో ప్రజల ఇబ్బందులు
- సురక్షితమై తాగు నీరు ఇవ్వాలంటున్న ప్రజలు
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో రోజూ నల్లా నీరు వస్తుంది. పొద్దున్నే లేస్తే చాలామంది నల్లాల వద్ద తాగేందుకు మంచినీటిని పట్టుకుంటుంటారు. అయితే రహమత్ నగర్లో రోజూ సురక్షితమైన మంచినీటికి బదులుగా మురికి నీటిని పదేపదే సరఫరా చేస్తున్నారు అధికారులు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు పద్ధతిని మార్చలేదని ఆరోపిస్తున్నారు. పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అదే విధంగా సరఫరా చేస్తే నీటి బోర్డుకు సమాచారం ఇచ్చిందన్నారు. మురుగునీటిని సరఫరా చేయడం ద్వారా వాటిని వాడకం వల్ల రహమత్ నగర్ డివిజన్లోని ప్రజలు అనారోగం పాలవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న ప్రజలకు స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్ున్నారు. మురుగు నీరు సరఫరా కాకుండా నీటి బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సురక్షితమైన తాగునీరు సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.