యాప్నగరం

డ్రంకన్ డ్రైవ్: తాగకపోయినా ఈ తప్పు చేస్తే జైలుకు.. సైబరాబాద్ పోలీసుల వార్నింగ్!

రోడ్డు భద్రత గురించి నిత్యం సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తోన్న సైబరాబాద్ పోలీసులు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 188ను బయటకు తీశారు.

Samayam Telugu 11 Mar 2021, 10:04 pm
హైదరాబాద్‌: బైక్ వెనుక సీట్లో కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి.. తాగి వాహనం నడపొద్దంటూ సోషల్ మీడియా ద్వారా నిత్యం అవగాహన కల్పిస్తోన్న సైబరాబాద్‌ పోలీసులు.. సరికొత్త అస్త్రాలను తెర మీదకు తెస్తున్నారు. ఇప్పటి వరకూ తాగి వాహనం నడిపిన వారిపైనే ఫోకస్ పెట్టిన ఖాకీలు... ఇక నుంచి తాగి నడుపుతున్న వ్యక్తితోపాటు.. ఆ వాహనంలో ఉన్న వారిపైనా కేసు పెడతామని హెచ్చరించారు.
Samayam Telugu drunk drive
Photo for representative purpose only


ఎవరైనా తాగి వాహనం నడుపుతూ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే.. అతడితోపాటు ప్రయణించే వాళ్లు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి తాగి ఉన్నాడని తెలిసి కూడా.. ఆ వాహనంలో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 188 ప్రకారం వాహనంలో ప్రయాణిస్తున్న వారిపైనా చర్యలు తీసుకుంటామంటూ సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. కాబట్టి మందు కొట్టి బండి నడపడమే కాదు.. ఆ బండిలో ప్రయాణించినా జైలుకు పోవాల్సి రావచ్చు. సో బీకేర్‌ఫుల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.