యాప్నగరం

తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో..

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం కాగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Authored byRaj Kumar | Samayam Telugu 10 May 2022, 11:25 am
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్‌ వద్ద ఓ ప్రైవేటు బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి టాటా ఏస్ వాహనంలోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అందులోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందగానే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రమాదంలో కాలిపోతున్న టాటా ఏస్.. బస్సుకు అంటుకుంటున్న మంటలు


వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్ పట్టణానికి సమీపంలోని భరత్‌నగర్ బైపాస్ రోడ్డు వద్ద తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ వాహనంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు ఆ వాహనంలోనే ఇరుక్కొని డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరోవైపు బస్సులోని 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇటు బస్సుకు మంటలంటుకోగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన కారణాలపై ఆరా తీస్తున్నారు. తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.