యాప్నగరం

హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు.. కూకట్‌పల్లిలో కంపించిన భూమి

భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. పండగ పూట కావడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. ఇవాళ ఉదయం తొమ్మిదన్నర ప్రాంతంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

Samayam Telugu 13 Jan 2021, 2:48 pm
హైదరాబాద్‌లో మరోసారి భూమి కంపించింది. ఈ సారి నగర నడిబొడ్డున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సిటీలోని కూకట్‌పల్లి అస్బెస్టాస్ కాలనీలో భూమి స్వల్పంగా కంపించింది. ఈరోజు ఉదయం ఉదయం 9:25 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో భూమి కంపించిది. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. దీతో ఒక్కసారిగా వారంతా భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూమి ఎక్కడ కంపిస్తుందోనన్న భయంతో ఉన్నారు.
Samayam Telugu కూకట్‌పల్లిలో భూకంపం
earth quake in Kukatpally


Read More: RMP డాక్టర్‌కు షాక్ ఇచ్చిన కోర్టు.. రెండు శిక్షలు ఒకేసారి అనుభవించాలన్న న్యాయస్థానం

గత ఏడాది అక్టోబర్ నెలలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే భూమిలోపల పొరల సర్దుబాటు వల్లే ఇలా ప్రకంపనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.