యాప్నగరం

Hyderabad: బిల్డింగ్‌పై నుంచి దూకిన ఇఫ్లూ వర్సిటీ స్టూడెంట్.. అసలేం జరిగింది ?

Hyderabad: ఓయూ పరిధిలోని ఇఫ్లూ యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని హస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 21 Jan 2023, 1:18 pm

ప్రధానాంశాలు:

  • ఇప్లూ వర్సిటీలో విషాదం
  • భవనంపై నుంచి దూకిన విద్యార్థిని
  • ఓయూలో ఉద్రిక్తత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu EFLU student
ఇఫ్లూ విద్యార్థిని అంజలి
Hyderabad: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇఫ్లూ (English and Foreign Languages University) యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. హర్యానాకు చెందిన విద్యార్థిని అంజలి (22) హాస్టల్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థిని మృతి విషం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన అంజలి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో (ఇఫ్లూ) క్యాంపస్‌లో ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇవాళ ఉదయం వర్సటీలోని ఓ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఆమె మృతికి గల కారణాలు ఇంక తెలియరాలేదు. అయితే విద్యార్థి సంఘాల ఆరోపణలు మరోరకంగా ఉన్నాయి. లేడీస్ హాస్టల్‌లో సరైన రక్షణ చర్యలు, గ్రీల్స్ లేకపోవడం వల్లే ఆ యువతి కింద పడి చనిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతి పట్ల సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

యూనివర్సిటీలో డ్రగ్, మందు కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31న ఇద్దరు బెంగాలీ అమ్మాయిలు తాగి ఓ కర్ణాటక అమ్మాయిపై దాడి చేశారన్నారు. మద్యం సేవించి లేడీస్ హాస్టల్‌లో నానా హంగామా సృష్టించారన్నారు. క్యాంపస్‌లో ఇంత దారుణమైన ఘటనలు జరుగుతున్నా.. వర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. దీంతో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

BJP: హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ యాక్షన్ ప్లాన్.. ముస్లింలపై 'పస్మాందా' అస్త్రం !
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.