యాప్నగరం

నేను చాలా బిజీ.. Don’t disturb me అంటున్న ఆర్‌‌ఎస్ ప్రవీణ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్ నేతల చుట్టూ తిరుగుతోంది. మాజీ ఎంపీ విసిరిన చాలెంజ్‌‌కి సెటైరికల్ పంచ్‌లు వేశారు బీజేపీ బండి సంజయ్, బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్. బలిసిన దొరల దందాలు వద్దని ఆయన అన్నారు.

Samayam Telugu 20 Sep 2021, 10:34 pm
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. మంత్రి కేటీఆర్‌ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన white challenge ఆసక్తికరంగా మారింది. ఆయన చాలెంజ్‌ని స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ఇద్దరికి సవాల్ విసిరారు. యువతపై ప్రభావం చేయగలిగిన నేతలుగా తాను మరో ఇద్దరికి చాలెంజ్ విసురుతున్నానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్ ప్రవీణ్‌ని సవాల్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ సంజయ్ సవాల్‌ని స్వీకరించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rs praveen


అయితే మరో నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇప్పటి తెలంగాణకు కావాల్సింది బలిసిన దొరల దందాలు కాదంటూ ఘాటు కామెంట్ చేశారు. డ్రగ్స్, గర్ల్‌ ఫ్రెండ్స్, బూతులు, బ్లాక్ వైట్ చాలెంజ్‌లు కాదని.. BLUE CHALLENGE కావాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. తాను అమరవీరుల స్తూపం సాక్షిగా పేదల కన్నీళ్లు తుడిచి, బహుజనులను ఏనుగు మీద ప్రగతి భవన్‌కి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నానని.. తనను డిస్టర్బ్ చేయొద్దంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఘాటు రిప్లై ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.