యాప్నగరం

హైదరాబాద్ చేరుకున్న ఈటల.. రేపు హుజూరాబాద్‌లో అనుచరులతో భేటీ

ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఈటలకు ఘన స్వాగతం పలికారు. ఈటల వెంట పలువరు బీజేపీ నేతలు కూడా ఉన్నారు. రేపు హుజూరాబాద్‌లో అనుచరులతో ఈటల సమావేశం కానున్నారు.

Samayam Telugu 3 Jun 2021, 11:15 am
మూడు రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా ఈటల అనుచరులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా మీడియా అడిగిని ప్రశ్నలకు ఈటల ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఢిల్లీలో బిజెపి అగ్రనాయకత్వం నాయకత్వం నుండి ఎలాంటి హామీ లభించింది ? బిజెపి లో చేరుతున్నారు అన్న మీడియా ప్రశ్నలకు ఈటల రాజేందర్ దాటవేస్తూ. వెళ్లిపోయారు.
Samayam Telugu ఈటల రాజేందర్


మరోవైపు ఈటల రేపు పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకావాలు కనిపిస్తున్నాయి. బుధవారం బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలతో ఈటల సమావేశమయ్యారు. వారంలోపు బీజేపీలో చేరుతారని కమలనాథులు అంటున్నారు. అయితే హుజూరాబాద్ లోని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం హుజూరాబాద్ వెళ్లి అనుచరులు, అభిమానులతో భేటి అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.