యాప్నగరం

అప్పుడు సర్వం కోల్పోయారు.. ఇతరులను ముంచొద్దు.. షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన రాబోతున్న సమయంలో విమర్శలు బాణాలు ఎక్కుపెడుతున్నారు నేతలు. గతంలోనూ ఒకరు పార్టీ పెట్టారని.. నమ్మి భూములు అమ్ముకుని సర్వం కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 3 Mar 2021, 6:15 pm
వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె పార్టీ ప్రకటన ఖాయమని స్పష్టమైన సంకేతాలు రావడంతో ఇప్పటికే విమర్శల పరంపర మొదలైంది. అధికార టీఆర్‌ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటే.. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. సమైక్యవాదులుగా చెప్పుకునే వైఎస్ కుటుంబం తెలంగాణలో రాజన్య రాజ్యం తెస్తామనడం హాస్యాస్పదమని ఇప్పటికే పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
ys sharmila


అదే విషయమై తాజాగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ కలహాలతోనే షర్మిల పార్టీ పెడుతున్నారన్నారు. వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలకు లోక్‌సభ సీటు, రాజ్యసభ్య సీటు ఇవ్వకపోవడంతోనే ఆమె పార్టీ పెడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలున్నాయన్నారు. షర్మిల పార్టీ కూడా చిరంజీవి ప్రజారాజ్యం తరహాలోనే ఉందన్నారు ప్రకాశరావు. చిరంజీవి పార్టీతో చాలా మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఆయన్ను నమ్మి భూములు అమ్ముకుని సర్వం కోల్పోయారని.. షర్మిల పార్టీ కూడా అదే తరహాలో నడుస్తోందన్నారు. పార్టీలు పెట్టి ఇతరులను ముంచొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.