యాప్నగరం

కళ్లలో కారం కొట్టి.. మాజీ రౌడి షీటర్ దారుణ హత్య

తీవ్రగాయాల పాలైన ఫిరోజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Samayam Telugu 26 Jan 2021, 8:34 am
హైదరాబాద్‌లో మాజీ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సిటీలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్కే సొసైటీలో మాజీ రౌడీషీటర్ ఫిరోజ్ దారుణ హత్యకు గురయ్యాడు. గత రాత్రి బోరబండలోని ఆర్కే సొసైటీ సమీపంలో ఫిరోజ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దీంతో దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఫిరోజ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Samayam Telugu మాజీ రౌడీ షీటర్ హత్య


Read More: తెలంగాణలో మందుబాబులకు శుభవార్త

గతంలో రౌడీ షీటర్ వాహిద్ కేసులో ఫిరోజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఫిరోజ్ కళ్లలో కారం కొట్టి దుండగులు కత్తులతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిరోజ్‌పై భూ కబ్జా ఆరోపణలతో పాటు పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫిరోజ్ హత్యకు పాత కక్షలు ఏమైనా కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.