యాప్నగరం

తొందరగా పెళ్లి చేయాలన్న కొడుకు.. మద్యంమత్తులో తండ్రి ఎంత పనిచేశాడంటే..

పెళ్లి చేయమని అడిగినంత మాత్రాన తండ్రి ఇలాంటి పని చేస్తాడా అంటూ స్థానికులు మండిపోతున్నారు. ఆస్పత్రిలో కొడుకు చావుబతుకల మధ్యపోరాడటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 17 Jan 2021, 9:11 am
మద్యం మత్తు అనేక జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. వావివరసలు మరిచి కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తాగిన మత్తులో అయినవారిపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా ఓ తండ్రి కన్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్‌నగర్ కొత్తూరు మండలం చేగూర్ గ్రామంలో తండ్రి కొడుకుల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాహం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెల రేగింది. తనకు తొందరగా వివాహం చేయాలని తండ్రి మీద కొడుకు ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు.
Samayam Telugu మద్యంమత్తులో కొడుకుపై దాడి


Read More: వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎంకు అస్వస్థత.. వెంటనే వైద్యం చేసిన సిబ్బంది

కొడుకు పెళ్లిగోలతో విసిగెత్తిపోయాడు. పెళ్లిచేయాలని కొడుకు తెస్తున్న ఒత్తిడితో అతడిపై మద్యం మత్తులో దాడికి దిగారు కన్నతండ్రి . తండ్రి ఎల్లయ్య గొడ్డలి తో దాడి చేశాడు. దీంతో ఈ దాడిలో కొడుకు నరేష్ కు తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న నందిగామ పోలీసులు. తండ్రిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి చేయమని అడిగితె కొడుకు మీద గొడ్డలితో దాడి చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.