యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం.. కొడుకు సరిగా చదవడం లేదని నిప్పంటించిన తండ్రి

ఎన్నిసార్లు చెప్పిన కొడుకు చదవకుండా టీవీ చూస్తు, గేమ్‌లో ఆడుతున్నాడంటూ తండ్రి మందలించాడు. రాత్రి తండ్రి ఇంటికొచ్చే సరికి చరణ్ టీవీ చూస్తున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి టార్పెంటాయిల్ పోసి చరణ్‌కు నిప్పంటించాడు.

Samayam Telugu 18 Jan 2021, 1:39 pm
హైదరాబాద్‌లో ఓ కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కంటికి రెప్పాలా కాపాడాల్సిన తండ్రే కొడుకు పాలిట యముడయ్యాడు. పాపం సరిగ్గా చదవడం లేదని కన్నబిడ్డకు నిప్పంటించాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత రాత్రి ఇంటికి వచ్చిన చరణ్ తండ్రి బాలు, చరణ్ ఇంట్లో టివి చూస్తుండటంతో ఆవేశంతో, టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు.
Samayam Telugu చదవడం లేదని నిప్పంటించిన తండ్రి


Read More: అడవిలో డంపింగ్ యార్డు.. అక్కడ ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
వివారాల్లోకి వెళ్తే.. ప్రభుత్వ పాఠశాలలో చరణ్(10) ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే చరణ్ ఎప్పుడు చదవకుండా టీవీ చూడడం, ఫోన్ తో గేమ్స్ ఆడడం చేస్తుండేవాడు. ఎన్నో సార్లు తల్లితండ్రులు చదువుకోమని నచ్చజెప్పారు. అయినా కూడా చరణ్ తన పద్ధతి మార్చుకోలేదు. అయితే ఈ క్రమంలో రాత్రి చరణ్ తండ్రి బాలు ఇంటికి వచ్చిన సమయంలో చరణ్ ఇంట్లో టివి చూస్తుండటంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. ఆవేశంతో తండ్రి బాలు వెంటనే టర్పెంటాయిల్ తీసుకొచ్చి చరణ్‌పై పోసి నిప్పంటించాడు. దీంతో అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చరణ్ ను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికి చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.