యాప్నగరం

ఎమ్మెల్యే రాజా సింగ్ శ్రీరామ నవమి వేడుకల్లో అగ్నిప్రమాదం

రాత్రి 7 గంటలకు శ్రీరామ నవమి వేడుకల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టపాసులు కాల్చారు. ఆయనతో పాటు అనుచరులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చారు.

Samayam Telugu 22 Apr 2021, 7:54 am

ప్రధానాంశాలు:

  • ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయంలో శ్రీరామ నవమి సంబరాలు
  • ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో వేడుకలు
  • టపాసులు పేల్చడంతో అగ్నిప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గంగాబౌలి ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం వద్ద నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో మంటలు అంటుకున్నాయి. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో భక్తులు భయంతో ఉరుకులు, పరుగులు పెట్టారు. ప్రతీ ఏటా రాజాసింగ్‌ ఆధ్వర్యంలో గంగాబౌలిలోని ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే టపాసులు కాల్చారు. బీజేపీ కార్యకర్తలు, రాజాసింగ్‌ అభిమానులు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చడంతో ఆలయం సమీపంలోని చెత్త, దేవాలయానికి ఆనుకొని ఉన్న సామగ్రికి మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు, బీజేపీ కార్యకర్తలు ఫైర్‌ స్టేషన్‌, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కొద్ది పాటి ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.