యాప్నగరం

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. పక్కనే స్కూల్, ఆందోళనలో విద్యార్థులు

Fire Accident: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చేలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల కారణంగా గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు కాలి బూడిదయ్యాయి. చుట్టుపక్కల దట్టంగా అలుముకున్న పొగతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Mar 2023, 3:46 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం
  • ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు
  • భయాందోళనలో స్థానికులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Fire Accident
అగ్ని ప్రమాదం
Fire Accident: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ మెున్న దక్కన్ మాల్, నిన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలు మరువక ముందే శాస్త్రిపురంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. గోదాంలో నిలిపి ఉంచిన రెండు డీసీఎం వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.
దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తు్న్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న గోదాం పక్కనే.. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను స్కూల్‌లో నుంచి ఖాళీ చేయించి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌కు తరలించారు. మరోవైపు ఈ పాఠశాలలోనే ఇవాళ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి. దీంతో ఇంటర్ విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. రహదారికి దగ్గరగా ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో బెంగళూరు, కర్నూలు రూట్‌లో వెళ్తున్న వాహనాలను మెహదీపట్నం మీదుగా మళ్లించారు.

ఇక స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 ఆర్థిక సాయం ప్రకటించారు. అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరుగురు ప్రాణాలు కోల్పోవటం విచారకరమన్నారు. మృతుల కుటుబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపును మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సూచించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.