యాప్నగరం

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం.. ఐదుగురికి పాజిటివ్

గతంలో కూడా ఇదే స్టేషన్‌లో 50మంది వరకు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు మరోసారి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రజలు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 4 Apr 2021, 4:22 pm
తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విసురుతోంది. దీంతో ప్రజలంతా మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనా పేషంట్లతో కార్పొరేట్ ఆస్పత్రులు, గాంధీ ఆస్పత్రుల బెడ్స్ ఫుల్ అయిపోయాయి. వైరస్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. రెండో దశలో పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం నెలకొంది.
Samayam Telugu కరోనా కలకలం


బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. ఓ ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరి స్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.