తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కరోనా పంజా విసురుతోంది. దీంతో ప్రజలంతా మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే కరోనా పేషంట్లతో కార్పొరేట్ ఆస్పత్రులు, గాంధీ ఆస్పత్రుల బెడ్స్ ఫుల్ అయిపోయాయి. వైరస్ మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. రెండో దశలో పాజిటివ్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం నెలకొంది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. ఓ ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరి స్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. ఓ ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరి స్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.