యాప్నగరం

కలుషిత ఆహారం తిని విద్యార్థులు, ఉపాధ్యాయులకు అస్వస్థత

మధ్యాహ్నం భోజనం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారితో పాటు నలుగురు ఉపాధ్యాయులు కూడా వాంతులు చేసుకున్నారు. దీంతో వారందర్నీ కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 6 Feb 2021, 1:56 pm
తెలంగాణలో ఈనెల 1వ తేదీ నుండి విద్యాసంస్థలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. దీంతో పలువురు విద్యార్ధులు తరగతులకు హాజరు అవుతున్నారు. అయితే.. ఈ క్రమంలో కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
Samayam Telugu గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం


పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో . బాధితులు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు విషయం చెప్పారు. వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.