యాప్నగరం

HYD: గంటలో నాలుగు చైన్లు.. రెచ్చిపోయిన దొంగలు.. పోలీసులకు సవాల్

నగరంలోని దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని మెడలో బంగారు గొలుసులు తెంపుకుని ఉడాయిస్తున్నాయి. భారీగా చోరీ కేసులు నమోదవుతున్నాయి.

Samayam Telugu 19 Jan 2022, 3:37 pm

ప్రధానాంశాలు:

  • నగరంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
  • గంటలో నాలుగు చోరీ ఘటనలు
  • పోలీసులకు సవాల్ విసురుతున్న కేటుగాళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
chain snatching
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోరీలు చేసి పోలీసులకే సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్‌ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ రెచ్చిపోయాడు. మూడు చైనింగ్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. మరో అమ్మాయి వద్ద నుంచి బంగారు గొలుసు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కేవలం గంట వ్యవధిలోనే నాలుగు చైన్ స్నాచింగ్‌లు నగరంలో కలకలం రేపాయి.
అలాగే రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. జీడిమెట్లలో వరలక్ష్మి అనే మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమా రాణి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించగా కేకలు వేయడంతో వదిలేసి దుండగుడు పారిపోయినట్లు సమాచారం. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సిటీ పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన చోటులో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఒకేరోజు గంటల వ్యవధిలో చోరీలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.