యాప్నగరం

రోడ్డు పక్కన సగం కాలిన మృతదేహం.. పదో తరగతి బాలికగా గుర్తింపు

రోడ్డు పక్కనే మృతదేహం పడి ఉంది. దీంతో డెడ్ బాడీ చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 19 Jun 2021, 10:05 am
మేడ్చల్ జిల్లాలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఘట్‌కేసర్ వద్ద రోడ్డుపై ఓ బాలిక మృతదేహం పడి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన పడి ఉన్న అమ్మాయి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మృతురాలు స్రవంతిగా గుర్తించారు. ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసినట్లు సమాచారం. .అర్ధరాత్రి ఇంట్లో నుండి బాలిక బయటకు వెళ్లినట్టు పోలీసులకు తల్లిదండ్రులు తెలిపారు. బాలిక పోచారం రాజీవ్ గృహకల్ప కాలనీ వాసిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.