యాప్నగరం

GHMC: భయం గుప్పిట్లో భాగ్యనగరం.. 36 గంటల్లో 15 వేల కంప్లైంట్స్!

GHMC: హైదరాబాద్ వాసులను వీధి కుక్కలు విపరీతంగా భయపెడుతున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే.. ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటనతో ఈ భయం ఇంకా పెరిగింది. అయితే.. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. దానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఏకంగా.. 36 గంటల్లో 15 వేల కంప్లైంట్స్ వచ్చాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 25 Feb 2023, 10:34 am

ప్రధానాంశాలు:

  • వీధి కుక్కలపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
  • 36 గంటల్లో టోల్ ఫ్రీ నెంబర్‌కి 15 వేల కంప్లైంట్స్
  • గతంలో ప్రజల నుంచి రోజుకు 30 వరకు ఫిర్యాదులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Stray Dogs
వీధి కుక్కలు
GHMC: హైదరాబాద్ వాసులను వీధి కుక్కలు భయం వెంటాడుతోంది. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రజలకు భరోసా ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. దీంతో వీధి కుక్కల (Stray Dogs) పై జీహెంచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్‌కి ఏకంగా 15 వేల కంప్లైంట్స్ వచ్చాయి. గతంలో రోజుకు 30 వరకు ఫిర్యాదులు వచ్చేవని అధికారులు చెబుతున్నారు.
కేవలం హైదరాబాద్‌ (Hyderabad) లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో.. శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న 17 నెలల పాప జర్పుల భానుశ్రీపై వీధి కుక్క దాడి (Dog Attack) చేయడంతో.. చిన్నారి ఎడమచేయిపై గాయమైంది.

ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో నాలుగేళ్ల బొల్లె శరీష్మ గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. రెండు కుక్కలు దాడి చేయడంతో తలపై గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో శుక్రవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్కలు వెంటపడ్డాయి. వాహనం అదుపు తప్పి కింద పడిన ఇద్దరిపై దాడి చేసి కాళ్లపై గాయపరిచాయి.

సూర్యాపేటలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం పదేళ్ల బాలుడు చెర్రిపై.. వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఛాతీపై గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఇదే కాలనీకి చెందిన 11 ఏళ్ల తరుణ్‌, పదేళ్ల షేక్‌ షాహిన్‌ వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని వాపోతున్నారు.
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.