యాప్నగరం

గదిలో బంధించి.. మ్యూజిక్ గట్టిగా పెట్టి.. మైనర్‌పై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్!

Hyderabad: మైనర్ బాలికపై నలుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెడిసిన్ కోసం మెడికల్ షాప్‌కు వెళ్లిన బాలికను ట్రాప్ చేసిన ఓ మహిళ గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులకు అప్పగించటంతో ఆమెపై వారు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 8 Feb 2023, 9:57 am

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
  • మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారం
  • కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అఘాయిత్యం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chandrayangutta gang rape
చంద్రాయణగుట్ట గ్యాంగ్ రేప్
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక్ గ్యాంగ్ రేప్‌కు గురైంది. నలుగురు వ్యక్తులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి నివసించే బాలిక (16) ఈనెల 4న మెడిసిన్ కోసం అని మెడికల్ షాప్‌కు వెళ్లింది. మెడికల్ షాప్ సమీపంలో ఉన్న ఓ మహిళ బాలికతో మాట కలిపింది. తక్కువ ధరకే మందులు ఇప్పిస్తానని ట్రాప్ చేసింది. తనతోపాటు కందికల్ గేటు వద్దకు బాలికను తీసుకువెళ్లింది.
అక్కడే గంజాయి మత్తులో తూలుతున్న నలుగురు యువకులకు బాలికను అప్పగించింది. మైనర్ బాలికపై వారు అసభ్యంగా ప్రవర్తిచటంతో ఆమె గట్టిగా ఏడవటం మెుదలుపెట్టింది. దీంతో ఆమెను అక్కడే ఉన్న ఓ రూంలో బంధించిన నలుగురు యువకులు శబ్ధం బయటికి పోవద్దన్నే ఉద్దేశ్యంతో మ్యూజిక్ సిస్టమ్‌ను పెద్దగా పెట్టారు. అనంతరం ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బలవంతంగా తాగించారు. మత్తులోకి జారుకున్న ఆమెపై నలుగురు కామాంధులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై ఆమెను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. మర్నాడు ఉదయం మత్తులో నుంచి తేరుకున్న బాలిక ఇంటికి చేరుకుంది.

జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి బోరున విలపించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఈనెల 5న చాంద్రాయణ గుట్ట పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలికను ట్రాప్ చేసిన మహిళ ఎవరు ?, ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురు కామాంధుల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Hyderabad: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఊహించలేం.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ !
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.