యాప్నగరం

వేడుకలు జరగకుండా చేయాలనుకున్నారు కానీ.. కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

ప్రగతిభవన్ వర్సెస్ రాజ్ భవన్ మధ్య ఉన్న విభేదాలు రిపబ్లిక్ డే వేళ్ మరింత ముదురుతున్నట్టు కనిపిస్తున్నాయి. గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం ఆసక్తికర కామెంట్లు చేస్తునే ఉన్నారు. ఉదయం రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా ప్రసంగించిన గవర్నర్.. కేసీఆర్ సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు చేయగా.. పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ వేడుకలు జరగకుండా కొంత మంది ప్లాన్ చేశారని కానీ.. ఓ శ్రేయోభిలాషి కోర్టును ఆశ్రయించటం వల్ల మళ్లీ వేడుకలు జరిగినట్టు తెలిపారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 26 Jan 2023, 6:04 pm

ప్రధానాంశాలు:

  • కేసీఆర్ సర్కార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గవర్నర్
  • వేడుకలు జరగకుండా కొంత మంది ప్లాన్ చేశారని వ్యాఖ్య
  • రాజ్యాంగాన్ని అవమానించిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kcr tamilisai
తమిళిసై
కేసీఆర్ సర్కార్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల వేళ రాజ్ భవన్ వేదికగా చేసిన ప్రసంగం ఆసాంతం కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఆసక్తికర కామెంట్లు చేసిన గవర్నర్ తమిళిసై.. పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు ప్రజల మధ్య జరగకుండా చేయాలని కొంత మంది ప్రయత్నించారని గవర్నర్ ఆరోపించారు. ఓ శ్రేయోభిలాషి కోర్టును ఆశ్రయించటం వల్ల మళ్లీ వేడుకలకు అవకాశం వచ్చిందన్నారు. అయితే.. రిపబ్లిక్ వేడుకలను ఘనంగా జరపాలని రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. కాగా.. రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని 2 రోజుల క్రితమే ప్రభుత్వం తెలియజేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభత్వం ఏమాత్రం పట్టించుకోలేదని తమిళిసై విమర్శించారు. రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన ప్రసంగ పాఠాన్ని కూడా ప్రభుత్వం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి రిపబ్లిక్ డే వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని తమిళిసై తెలిపారు.
అంతకు ముందు రాజ్ భవన్‌లో జరిగిన వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ సర్కార్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ వాళ్లు అంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తా. తెలంగాలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. కొందరికే ఫామ్‌హౌస్‌లో కాదు.. అందరికి ఫామ్‌లు కావాలి. తెలంగాణలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు." అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు గవర్నర్.

కేసీఆర్​కు మన దేశంలో ఉండే అర్హత లేదు: బండి సంజయ్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.