యాప్నగరం

Hyderabad: మద్యం కోసం మనవడినే అమ్మేసిన తాత.. ఛీ వీడసలు మనిషేనా?

హైదరాబాద్ హకీంపేటలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. కూతరు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 17 May 2023, 10:02 am

ప్రధానాంశాలు:

  • బంజారాహిల్స్‌లో దారుణ ఘటన
  • మద్యానికి డబ్బులు ఇవ్వలేదని మనవడిని అమ్మేసిన తాత
  • కేసు నమోదు చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu grandfather sold grandson
మనవడిని అమ్మిన తాత
Banjara Hills:హైదరాబాద్ బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం కోసం ఓ తాత సొంత మనవడినే అమ్మేశాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బంజరాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని హకీమ్ పేటలో నివాసం ఉంటే ఖలీల్ మద్యానికి బానిస. ఏ పని చేయకుండా నిత్యం మద్యం సేవిస్తూ సోమరిగా తిరుగుతుంటాడు. మద్యానికి డబ్బు ఇవ్వాలని ఇంట్లో వాళ్లను వేధింపులకు గురి చేస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఖలీల్ కూతురు ప్రసవం కోసం పుట్టింటింకి రాగా... ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

రెండ్రోజుల క్రితం రోజులాగే ఖలీల్ మద్యం డబ్బుల కోసం ఇంట్లో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టాడు. వారు డబ్బులు లేవని చెప్పటంతో ఆగ్రహానికి లోనయ్యాడు. ఇంట్లోవాళ్లు వారివారి పనుల్లో నిమగ్నై ఉండగా.. రోజుల వయస్సున్న మనవడిని ఎత్తుకెళ్లాడు. చిన్నారిని అమ్మేసి మద్యం సేవించాడు. చిన్నారి కనిపించకపోయేసరికి ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఫలితం లేకపోవటంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఖలీల్‌ను పట్టుకొని విచారించగా.. చిన్నారిని తానే విక్రయించానని ఒప్పుకున్నాడు. మద్యం డబ్బుల కోసం తన మనవడిని అమ్మేశానని చెప్పాడు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మద్యం డబ్బుల కోసం సొంత మనవడినే అమ్మిన ఖలీల్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వాడు మనిషేనా అంటూ మండిపడుతున్నారు. మనవడితో ఆడుకోవాల్సిందిపోయి మద్యం డబ్బుల కోసం అమ్మేయటమేంటని ఫైరవుతున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.