యాప్నగరం

Gujarat పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్.. పరీక్షకు రెండు గంటల ముందే..

Gujarat Paper Leak: గుజరాత్ పోటీ పరీక్షా పేపర్ హైదరాబాద్‌లో లీక్ కావటం కలకలం రేపుతోంది. గుజరాత్ పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు ఇవాళ పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్షకు రెండు గంటల ముందు హైదరాబాద్‌లో పేపర్ లీక్ అయింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 Jan 2023, 3:33 pm

ప్రధానాంశాలు:

  • గుజరాత్ పోటీ పరీక్ష పేపర్ హైదరాబాద్‌లో లీక్
  • హైదారాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ ప్రింటైన పరీక్షా పేపర్లు
  • 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gujarat Paper Leak
గుజరాత్ పోటీ పరీక్షల పేపర్ హైదరాబాద్‌లో లీక్
Gujarat Paper Leak: గుజరాత్‌లో ఇవాళ జరగాల్సిన పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామక పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కావటంతో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షకు రెండు గంటల ముందే హైదరాబాద్‌లో పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రాలోనూ పేపర్ ప్రింట్ అయినట్లు అధికారులు చెప్పారు. ఒడిషాకు చెందిన ప్రదీప్ నాయక్, హైదరాబాద్‌కు చెందిన జీత్ నాయక్‌లు ఈ పేపర్ లీక్ ఘటనకు సూత్రధారులుగా గుర్తించారు. జీత్ నాయక్ పేపర్‌ను మద్రించి.. ప్రదీప్ నాయక్‌కు అందజేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై హైదారాబాద్, ఆంధ్రాలో ఏటీఎస్ అధికారులు విచారణ చేపట్టారు.
పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో పరీక్షా పేపర్ లీక్ కావటం, మరో రెండు గంటల్లో జరగాల్సిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించటం పట్ల అభ్యర్థులు అసహనం వ్యక్తంచేశారు. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షా పేపర్ లీక్ కావటంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్‌కు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. గుజరాత్‌లో 1,181 పంచాయతీ జూనియర్ క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఉద్యోగాల కోసం దాదాపు 9.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం కోసం సన్నద్ధమై.. నేడు జరగాల్సిన పరీక్షకు సిద్ధమయ్యారు. అయితే.. పేపర్ లీక్ ఘటనతో చివరి క్షణంలో పరీక్షలు రద్దయ్యాయి. దీంతో కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు విమర్శించారు. పేపర్ లీక్ కారణంగా గత 12 ఏళ్లలో 15 సార్లు పోటీ పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.