యాప్నగరం

Medical Colleges: కేంద్రం తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయట్లేదు: మంత్రి హరీశ్ రావు

Telanganaలో నూతనంగా ఎనిమిది మెడికల్‌ కాలేజీల్లో (Medical Colleges) అడ్మిషన్‌లు ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 850 మెడికల్‌ సీట్లు (Medical Seats) మాత్రమే ఉండగా... గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయన్నారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఒక్క ఏడాదే 8 కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేశామని హరీశ్ రావు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 3 Oct 2022, 3:47 pm
Telanganaకు కేంద్రం మెడికల్ కాలేజీలు (Medical Colleges) మంజూరు చేయట్లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. దేశవ్యాప్తంగా మోడీ సర్కారు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో 1200 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్ కాలేజీలు వస్తాయని తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడుకున్న కల ఇప్పుడు నిజమవుతోందని చెప్పారు.
Samayam Telugu harish new
హరీశ్ రావు


రాష్ట్రం విడిపోక ముందు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ (Kalvakuntla Chandrashekar Rao) చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న హరీశ్ రావు.. భవిష్యత్తులో ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే 8 కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేశామని హరీశ్ రావు వెల్లడించారు.

తెలంగాణ ఏర్పడే నాటికి 850 మెడికల్‌ సీట్లు మాత్రమే ఉండగా... గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయన్నారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడి విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌, చైనాకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందని ప్రశ్నించిన హరీశ్ రావు.. సీట్లు పెరిగితే మన విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరముండదన్నారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.