యాప్నగరం

TS: మరో 3 రోజులూ భారీ వర్షాలు.. మూసీకి పెరిగిన వరద

Telangana Rain: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వరుసగా మూడో రోజు వాన దంచికొట్టింది. హైదరాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి విడతల వారీగా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కి.మీ. మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 8 Sep 2022, 12:00 am
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు వర్షాలు (Telangana Rain) కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం (సెప్టెంబర్ 7) మధ్యాహ్నం నుంచి విడతల వారీగా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులుగా కురుస్తున్న వానలతో అటు.. మూసీ నదిలో మరోసారి వరద ప్రవాహం పెరిగింది. ముసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు బ్రిడ్జి పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా చాదర్‌ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
Samayam Telugu Telangana Rain
తెలంగాణ వర్షాలు


జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, కూకట్‌పల్లి, నిజాంపేట్‌లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, రామ్ నగర్, అంబర్‌పేట, ఉప్పల్, కోఠి, గోషామహల్‌, బహదూర్‌పుర, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

మరోవైపు.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె చెప్పారు. పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.