యాప్నగరం

Hyd: వణికిస్తున్న వాన.. పలు కాలనీలకు ముంపు ముప్పు

Telangana Rain: హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురుస్తోంది. గురువారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మరో గంట పాటు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 8 Sep 2022, 10:36 pm
హైదరాబాద్ నగరంలో కుండపోత వాన కురుస్తోంది. గురువారం (సెప్టెంబర్ 8) రాత్రి 8.30 గంటలకు మొదలైన వాన గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం కురిసిన వానతో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం కాగా.. మళ్లీ కురుస్తున్న వర్షం నగరవాసులను వణికిస్తోంది.
Samayam Telugu Hyderabad rain
హైదరాబాద్ వర్షం


అత్యవసరమైతే గానీ ప్రజలెవరూ బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరో గంటపాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 19 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలను జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దించారు.

పంజాగుట్ట - లక్డీకాపూల్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మాసబ్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, నేరేడ్మెట్, సైనిక్‌పురి, ఏఎస్ రావు నగర్, కాప్రా, చెర్లపల్లి, దమ్మాయిగూడ, బాలాజీ నగర్, కీసర, ఘట్కేసర్, నారపల్లి, మేడిపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.

కాప్రా చెరువు నుంచి జమ్మిగడ్డ సోనియా గాంధీ నగర్ మీదుగా నాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నాలా ఉధృతంగా ప్రవహిస్తే కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరే ముప్పు ఉంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.