తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిన నగరవాసులకు భారీ వర్షం ఊరటనిచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి ఆకాశం మేఘావృతం కాగా.. కాసేపటికే వర్షపు జల్లులు మొదలయ్యాయి. అవికాస్తా కాసేపటికే భారీవర్షంగా మారింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్సార్ నగర్, ఎల్బీనగర్; వనస్థలిపురం, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. అలాగే కూకట్పల్లి, హైదర్నగర్, బాలాజీనగర్, కేపీహెచ్బీ కాలనీ, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో సాయంత్రం వర్షం కురుస్తుందని వాతావరణశాఖ మధ్యాహ్నమే హెచ్చరికలు జారీచేసింది. సాయంత్రం 5.30గంటల సమయంలో వర్షం కురుస్తుందని చెప్పగా.. ఆ సమయానికి గంట ముందే వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికొచ్చే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు మాత్రం వర్షం రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా హైదరాబాద్లో బుధవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో 45 డిగ్రీలకు మంచి ఎండలు దంచికొడుతున్నాయి. త రెండ్రోజులుగా సిటీలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మాదాపూర్తో పాటు బాలాజీనగర్, మైత్రీవనం, తిరుమలగిరి, అడ్డగుట్టలో 41.3, మౌలాలిలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక ప్రశాంత్నగర్, శ్రీనగర్కాలనీ, జుమ్మెరాత్ బజార్లో 40.9, మచ్చబొల్లారం, అల్కాపురి కామన్హాల్లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి
రానున్న 24గంటల్లో వర్షాలు...తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 - 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతో వాయుగుండం మరింత బలపడే అవకాశమున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ నగరంలో సాయంత్రం వర్షం కురుస్తుందని వాతావరణశాఖ మధ్యాహ్నమే హెచ్చరికలు జారీచేసింది. సాయంత్రం 5.30గంటల సమయంలో వర్షం కురుస్తుందని చెప్పగా.. ఆ సమయానికి గంట ముందే వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికొచ్చే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు మాత్రం వర్షం రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న 24గంటల్లో వర్షాలు...తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 - 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ, ఏపీ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతో వాయుగుండం మరింత బలపడే అవకాశమున్నట్లు తెలిపింది.