యాప్నగరం

Guru Viswasphoorthi: వ్యక్తిగత మార్పే సామాజిక మార్పునకు పునాది

తనకోసం ఏమీ ఆశించకుండా, అందరి కోసమే తన జీవితమని, ఆడంబరాలకు, ప్రచారాలకు దూరంగా ఏకాంత జీవనం గడుపుతూ, భౌతికతలేని ఆధ్యాత్మికం లేదని, ఆ రెండింటి సమన్వయంతోనే మనిషి జీవితం సార్ధకం అవుతుందని, అందుకు ఉదాహరణగా, వారి జీవితాన్నే చూపిస్తున్న గొప్న వ్యక్తి. మానవత్వం – మేధస్సుల మేలి మేళవింపుతో, దానికి ఆధ్యాత్మిక చేరికతో మానవ జీవితాన్ని మహొన్నతస్థితికి ప్రస్థానింపజేయడానికి సైంటిఫిక్ సెయింట్, గురు విశ్వస్ఫూర్తి వారు ‘ధ్యానమనోప్రస్థానమ్’ మార్గాన్ని ప్రవేశపెట్టారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 2 May 2023, 4:23 pm

ప్రధానాంశాలు:

  • ధ్యానమనో ప్రస్థానంలో గురు విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుకలు
  • పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించిన స్ఫూర్తి కుటుంబం
  • ముఖ్య అతిథులుగా హాజరైన తెలుగు వర్సిటీ మాజీ ప్రొఫెసర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Guru viswashpoorthi
సైంటిఫిక్ సెయింట్, ఆధ్యాత్మిక విశ్వగురువు 83వ జన్మదిన వేడుకలను సైన్స్ యూనివర్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగు యూనివర్సిటీ విశ్రాంత డైరెక్టర్ ఆచార్య టి గౌరీశంకర్, న్యూఢిల్లీలోని నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ మాజీ కో-ఆర్డినేటర్ పి.శంకర్రావు, సైన్స్ యూనివర్స్ అధినేత రాజేంద్ర,పీఏసీఎస్ ఛైర్మన్ బి రామ్‌దాస్‌లు విచ్చేశారు.
ఈ సందర్భంగా ‘శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి నిర్దేశించిన ఆసన ప్రాణాయామ ధ్యాన విధానం ద్వారా మానవతా విలువలతో కూడిన నవ ఆత్మీయ సమాజం నిర్మాణానికి.. వ్యక్తిగత మార్పే సామాజిక మార్పునకు పునాది అని’ గురుదేవులు దివ్య సందేశాన్ని వినిపించారు.

గురుదేవుల జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో భాగంగా యువతకు ఉపయోగపడే ఆన్‌లైన్ ఉచిత కంప్యూటర్ క్లాస్లులు, వివిధ కోర్సుల్లో అనుభవజ్ఞ‌ులైన ఫ్యాకల్టీతో మే 1 నుంచి 30 వరకూ నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 600 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జంట నగరాల్లోని ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటుచేసిన 25 చలివేంద్రం కేంద్రాలలో మజ్జిగ పంపిణీ చేపట్టారు.

ధ్యానమనోప్రస్థాన కేంద్రంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో 200 మంది భక్తులు, పరిసరప్రాంత వాసులను వైద్యులు పరీక్షించి ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. గురు విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుకల్లో సుమారు 800 మంది భక్తులు పాల్గొన్నారు.


Read More Latest Telangana News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.