యాప్నగరం

దొంగతనంలో ఇది నెక్స్ట్ లెవెల్.. ఇలాంటి దొంగలు మీ ఇంటికీ రావొచ్చు తస్మాత్ జాగ్రత్త!

Banjarahills Theft: హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సరికొత్త పంథాలో దొంగతనాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. అలాంటి దొంగతనమే ఫిలింనగర్‌లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని ఏ మార్చిన ఓ దొంగ సొత్తుతో ఉడాయించాడు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Mar 2023, 11:57 am

ప్రధానాంశాలు:

  • ఫిలింనగర్‌లో సరికొత్తపంథాలో దొంగతనం
  • పిల్లల్ని ఏమార్చి సొత్తుతో పరారైన దొంగ
  • తెలిసిన వారి పనిగా పోలీసుల అనుమానం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Robbery in Filmnagar
హైదరాబాద్‌లో దొంగతనం
Hyderabad: ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి గుల్ల చేస్తున్నారు. చేతికందినకాడికి దోచుకెళ్తున్నారు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. దొంగతనాలు మాత్రం ఆగటం లేదు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ కళ్లుకప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు జరిగేవి. తెలివిమీరిపోయిన దొంగలు ఇప్పుడు సరికొత్తపంథాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. అలాంటి దొంగతనమే హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తండ్రి పంపించాడని పిల్లల్ని నమ్మించిన ఓ దొంగ ఇంట్లోని బీరువా తెరిచి నగలు, నగదును దోచుకెళ్లాడు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న బి.నాగార్జున కుటుంబతం కలిసి ఫిలింనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం నాగార్జున ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లగా.. అతడు భార్యతో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో నాగార్జున ఇద్దరు పిల్లలు పృథ్విరాజ్ (11), చందన శ్రీ(7) స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు.

తలుపులు వేసుకొని చిన్నారులు ఇద్దరూ ఇంట్లో ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఓ అగంతకుడు నాగార్జున ఇంటి తలుపు తట్టాడు. తనను నాగార్జున పంపాడని.., బీరువాలోని దుస్తులు, తీసుకురామన్నాడని చిన్నారులకు చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రృథ్వికి రూ. 10 ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోమనటంతో చిన్నారు దుకాణం వద్దకు వెళ్లాడు. ఇంతలో బీరువా తెరిచిన అగంతకుడు.. అందులోని 13 లక్ష్మీదేవి బంగారు నాణేలు, తులం చెవి పోగులు, తొమ్మిది తులాల వెండి పట్టీలు, రూ. 55 వేల క్యాష్ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు.

దుకాణం నుంచి తిరిగి వచ్చిన పృథ్వీ బీరువా తలుపులు తెరిచి ఉండటం.., సామాన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి.. స్థానికల సాయంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు ఇంటికి వచ్చి చూడగా.. బీరువాలోని నగలు, నగదు కనిపించలేదు. దీంతో వెంటనే వారు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరో బాగా తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో నుంచి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బీరువా తాళాలు తీసుకెళ్లాలని.., గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండేలా పిల్లలకు సూచనలివ్వాలని అంటున్నారు. కొత్త తరహా పద్దతుల్లో దొంగలు రెచ్చిపోతున్నారని.., వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.