యాప్నగరం

బిల్డింగ్‌పై మనిషి పుర్రె, ఎముకలు.. హైదరాబాద్‌లో కలకలం

AS Rao Nagar: కాంప్లెక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం కూలీలతో మట్టికుప్పలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి.

Samayam Telugu 30 Dec 2020, 11:33 am
హైదరాబాద్‌లోని ఏఎస్‌ రావు నగర్‌‌లో మనిషికి చెందిన పుర్రె, ఎముకలు కనిపించడం కలకలం రేపుతోంది. ఏఎస్ రావు నగర్ డివిజన్‌ రాధికా చౌరస్తా సమీపంలోని ఓ బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయం భవనంపై ఈ పుర్రె, ఎముకలు వెలుగు చూశాయి. మేడపైన మట్టికుప్పలో పుర్రె, ఎముకలు స్థానికులకు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Skull bones in as rao nagar


రాధికా చౌరస్తాలోని వర్టెక్స్‌ కాంప్లెక్స్‌ భవనంపై కొన్నేళ్లుగా మట్టి కుప్ప ఉంది. దాంతో తరచూ స్లాబ్‌లో లీకేజీ సమస్య తలెత్తుతుంది. కాంప్లెక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు మంగళవారం కూలీలతో మట్టికుప్పలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి కుప్పలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయి. వెంటనే భయపడిపోయిన కూలీలు ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రతినిధులకు తెలియజేశారు. అసోసియేషన్‌ ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించారు.

కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌, ఎస్సై అనంతచారి ఘటన స్థలానికి చేరుకొని పుర్రె, ఎముకలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.