Hyderabad: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య.. నగరంలో విషాదకర ఘటన
Hyderabad: హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై, భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదనే బాధతో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. భర్తలో మార్పు వస్తుందనే కారణంతో తాను పట్టింటికి వెళ్లానని, మనస్తాపంతో ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని తాను ఊహించలేదని భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. తండ్రి మరణంతో పిల్లలు పెద్ద దిక్కును కోల్పోయారు.
ప్రధానాంశాలు:
- హైదరాబాద్లో విషాదకర ఘటన
- భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త బలవన్మరణం
- కేసు నమోదు చేసిన పోలీసులు
Hyderabad: హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. తాగుడుకు బానిస కావడం వల్ల విసుగు వేసారి భార్య పుట్టింటికి వెళ్లడంతో మనోవేదనకు గురై భర్త బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన గోపాల్ (30) అనే వ్యక్తికి గాయత్రి అనే యువతితో గతంలో వివాహం జరిగింది. వీరికి సంతానంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం గోపాల్ నగరంలో ఆటో నడుపుకుంటున్నాడు. అయితే గోపాల్ మద్యానికి పూర్తిగా బానిసై రోజూ బాగా తాగేసి మద్యం మత్తులో రోజూ ఇంటికి వచ్చేవాడు. ఆటో నడపగా వచ్చే డబ్బులు తాగుడుకే సరిపోయేది. తాగుడుకు బానిపై భార్య, పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు.
రోజూ పీకల్లోతు తాగేసి ఇంటికొచ్చి భార్య గాయత్రితో గొడవ పడుతుండే వాడు. గత కొంతకాలంగా రోజూ ఇలా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం మానేయాలని భర్తను భార్య గాయత్రి ఎన్నోసార్లు కోరింది. అయినా మద్యానికి బానిస అవ్వడం వల్ల గోపాల్ దాని నుంచి బయట పడలేకపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మానకపోవడం, రోజూ ఇంటికొచ్చిన తర్వాత గొడవ పడుతుండటంతో భార్య గాయత్రికి విసుగు వచ్చేసింది. దీంతో ఒకరోజు తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య పుట్టింటికి వెళ్లిన బాధలో గోపాల్ మరింతంగా తాగడం స్టార్ట్ చేశాడు. తన దగ్గరకు తిరిగి రావాలని భార్యను ఎన్నోసార్లు కోరాడు. అయినా ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు.
దీనిపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాను పుట్టింటికి వెళ్తే భర్తలో మార్పు వస్తుందని ఆశించానని, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రి మరణంతో పిల్లలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భర్త మరణించడంతో భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రోజూ పీకల్లోతు తాగేసి ఇంటికొచ్చి భార్య గాయత్రితో గొడవ పడుతుండే వాడు. గత కొంతకాలంగా రోజూ ఇలా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మద్యం మానేయాలని భర్తను భార్య గాయత్రి ఎన్నోసార్లు కోరింది. అయినా మద్యానికి బానిస అవ్వడం వల్ల గోపాల్ దాని నుంచి బయట పడలేకపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా మద్యం తాగడం మానకపోవడం, రోజూ ఇంటికొచ్చిన తర్వాత గొడవ పడుతుండటంతో భార్య గాయత్రికి విసుగు వచ్చేసింది. దీంతో ఒకరోజు తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య పుట్టింటికి వెళ్లిన బాధలో గోపాల్ మరింతంగా తాగడం స్టార్ట్ చేశాడు. తన దగ్గరకు తిరిగి రావాలని భార్యను ఎన్నోసార్లు కోరాడు. అయినా ఆమె తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై గోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు.
దీనిపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాను పుట్టింటికి వెళ్తే భర్తలో మార్పు వస్తుందని ఆశించానని, కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని భార్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రి మరణంతో పిల్లలకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. భర్త మరణించడంతో భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.