Jubilee Hills: ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొని పచ్చని సంసారాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన రాము, సంధ్య దంపతలు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాము డ్రైవర్గా పని చేస్తుండగా.. సంధ్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. వీరికి పదో తరగతి చదువుతున్న కుమార్తెతో పాటు ఏడో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. మార్చి 31న పెళ్లి రోజు కావటంతో తాను మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వాలంటూ రాము తన భార్యను కోరాడు. డబ్బులు ఇచ్చేందుకు రాము భార్య సంధ్య నిరాకరించింది. ఈ రోజు పెళ్లిరోజని.. గుడికి వెళ్దామని చెప్పింది. డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన రాము.. కాసేపటి తరువాత ఇంటికి తిరిగొచ్చాడు. తాగటానికి డబ్బు ఇవ్వనందుకు తాను కెమికల్ తాగానని.., చనిపోతున్నాంటూ భార్యతో చెప్పాడు.
దీంతో ఆందోళనకు గురైన భార్య సంధ్య పొరుగింటి వారి సాయంతో రామును మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ ట్రీట్మెంట్కు లక్షల్లో ఖర్చవుతుండటంతో అంత ఆర్థిక స్థోమత లేక.. ఈనెల 1న పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఈనెల 2న రాము కన్నుమూశాడు. ఈనెల 3 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. తండ్రి మరణించిన బాధలోనూ వారి కుమార్తె పదోతరగతి పరీక్షకు హాజరైంది. చిన్న కారణానికే ఇంటి పెద్దదిక్కు ఆత్మహత్య చేసుకోవటంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
దీంతో ఆందోళనకు గురైన భార్య సంధ్య పొరుగింటి వారి సాయంతో రామును మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ ట్రీట్మెంట్కు లక్షల్లో ఖర్చవుతుండటంతో అంత ఆర్థిక స్థోమత లేక.. ఈనెల 1న పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఈనెల 2న రాము కన్నుమూశాడు. ఈనెల 3 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. తండ్రి మరణించిన బాధలోనూ వారి కుమార్తె పదోతరగతి పరీక్షకు హాజరైంది. చిన్న కారణానికే ఇంటి పెద్దదిక్కు ఆత్మహత్య చేసుకోవటంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
- Read More Telangana News And Telugu News