యాప్నగరం

పెళ్లి రోజున మద్యానికి డబ్బులివ్వని భార్య.. ఊహించని నిర్ణయం తీసుకున్న భర్త!

Hyderabad: ఓ వైపు పెళ్లి రోజు ఆనందంలో భార్య.. మరోవైపు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న కూతురు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి మరణించగా.. పుట్టెడు బాధలోనూ కన్నీళ్లను ఆపుకొని కుమార్తె పదో తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 4 Apr 2023, 1:01 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విషాదకరఘటన
  • మద్యానికి భార్య డబ్బివ్వలేదని భర్త బలవన్మరణం
  • పుట్టెడు దుఃఖంలోనూ పది పరీక్షకు హాజరైన కూతురు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jubilee Hills
మద్యానికి డబ్బు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
Jubilee Hills: ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొని పచ్చని సంసారాలను చేజేతులా కూల్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన రాము, సంధ్య దంపతలు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. రాము డ్రైవర్‌గా పని చేస్తుండగా.. సంధ్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. వీరికి పదో తరగతి చదువుతున్న కుమార్తెతో పాటు ఏడో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.
మార్చి 31న పెళ్లి రోజు కావటంతో తాను మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వాలంటూ రాము తన భార్యను కోరాడు. డబ్బులు ఇచ్చేందుకు రాము భార్య సంధ్య నిరాకరించింది. ఈ రోజు పెళ్లిరోజని.. గుడికి వెళ్దామని చెప్పింది. డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన రాము.. కాసేపటి తరువాత ఇంటికి తిరిగొచ్చాడు. తాగటానికి డబ్బు ఇవ్వనందుకు తాను కెమికల్ తాగానని.., చనిపోతున్నాంటూ భార్యతో చెప్పాడు.

దీంతో ఆందోళనకు గురైన భార్య సంధ్య పొరుగింటి వారి సాయంతో రామును మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అక్కడ ట్రీట్‌మెంట్‌కు లక్షల్లో ఖర్చవుతుండటంతో అంత ఆర్థిక స్థోమత లేక.. ఈనెల 1న పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఈనెల 2న రాము కన్నుమూశాడు. ఈనెల 3 తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా.. తండ్రి మరణించిన బాధలోనూ వారి కుమార్తె పదోతరగతి పరీక్షకు హాజరైంది. చిన్న కారణానికే ఇంటి పెద్దదిక్కు ఆత్మహత్య చేసుకోవటంతో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.