యాప్నగరం

పగలు పూలు అమ్ముతూ.. రాత్రిళ్లు ఇళ్లలో దూరి.. పాడుపనులు

ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని దారుణ పరిస్థితులు దాపురించాయి. పూలు, పండ్లు.. ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటూ వీధుల్లో తిరిగే వారిని చిరువ్యాపారులు అనుకుంటే పొరబాటే.!

Samayam Telugu 28 Nov 2021, 6:14 pm
సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనదారులను ఆపి చెక్ చేస్తున్నారు. ఇంతలో అటుగా బైక్‌పై వచ్చిన వ్యక్తి ఖాకీలను చూసి కంగారుపడుతున్నాడు. అతని వాలకం చూసి అనుమానం వచ్చిన పోలీసులు అతగాడిని ఆపి ఆరా తీయడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సుమారు కిలో బంగారం బయటపడింది. డబ్బులు, సెల్‌ఫోన్లు, బైక్ ఇలా ఒక్కొక్కటీ బయటికొచ్చాయి. కేటుగాడిని ఘరానా దొంగ గఫార్‌ఖాన్ అలియాస్ జిగర్‌(28)గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
flowers


గఫార్‌ఖాన్ దొంగతనం చేసే స్టైలే వేరు. పగలు పూలమ్ముకుంటున్నట్లు వీధుల్లో తిరుగుతూ రెక్కీ చేసి.. రాత్రిళ్లు ఇళ్లలో దూరి పాడుపనులు చేస్తాడని పోలీసులు తెలిపారు. రాత్రి వేళలో వేషం మార్చి ఇళ్లలో చోరీలు చేస్తాడు. బంగారం, డబ్బు, సెల్‌ఫోన్లు ఏది దొరికితే అది తీసుకుని ఉడాయించేవాడు. అతనిపై కేసుల లిస్టు చాంతాడంత ఉండడం గమనార్హం. సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎయిర్‌పోర్ట్, రాజేంద్రనగర్, శంషాబాద్ ఇలా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 27కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 805 గ్రాముల బంగారం, 1.9 లక్షల నగదు, ఖరీదైన బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.