యాప్నగరం

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నూరేళ్లు బాగుండాలని ప్రార్థిస్తూ.. 101 మేకలు బలి

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై జరిగిన దాడి నేపథ్యంలో పాతబస్తీలో ఆయన అభిమానుల ప్రార్థలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అభిమాని 101 మేకలు బలిచ్చారు.

Samayam Telugu 7 Feb 2022, 10:17 am
ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై జరిగిన దాడి నేపథ్యంలో పాతబస్తీలో ఆయన అభిమానుల ప్రార్థలు కొనసాగుతున్నాయి. ఆదివారం యాకత్‌పురాకు చెందిన వ్యాపారి మహమ్మద్‌ షకీల్‌.. అసదుద్దీన్‌ ఒవైసీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 101 మేకలను బలి (సద్‌ఖా) ఇచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ దాడి నుంచి త్రుటిలో తప్పించుకోవడంతో బాగ్ ఎజహనారా వద్ద ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అభిమాని షకీల్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మలక్‌పేట్‌ ఎమ్మెల్యే బలాలా హాజరయ్యారు..
Samayam Telugu అసదుద్దీన్ ఒవైసీ


ఇటీవల మీరట్‌లో ప్రచార సభలో పాల్గొన్న అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీకి వస్తుండగా కాల్పులు జరిగాయి.. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపగా ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలోనే కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన దుండగులను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్లనే కాల్పులు జరిపామని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్బంగా ఒవైసీ హిందువులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగాలు ఉండటంతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.