యాప్నగరం

ATMలో మనీ డిపాజిట్ చేసినట్లు నటించి.. కోటి 30 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!

ఏటీఎంలో నగదు నింపడం వారి బాధ్యత. కానీ నోట్ల కట్టలను చూడగానే వారి బుద్ధి పెడదారి పట్టింది. డబ్బు మీద ఆశతో.. ఏటీఎంలో నింపాల్సిన నగదును తమ బ్యాగుల్లో నింపుకున్నారు. చివరకు కటకటాల పాలయ్యారు.

Samayam Telugu 9 Mar 2021, 9:10 pm
ఉపాధి కల్పించే కంపెనీకే కేటుగాళ్లు సున్నం పెట్టే ప్రయత్నం చేశారు. ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నగదు నింపే కంపెనీ చేసే ఉద్యోగులు అత్యాశకు పోయారు. ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.1.30 కోట్ల నగదును పక్క దారి పట్టించారు. ఈ విషయం గ్రహించిన కంపెనీ యాజమాన్యం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu money
Representative image


సికింద్రాబాద్‌కు చెందిన కృష్ణ, మహబూబాబాద్‌కు చెందిన రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వీరు దగ్గర్నుంచి రూ.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ గతంలో ఇదే తరహా మోసం కేసులో జైలుకు వెళ్లొచ్చాడని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.