యాప్నగరం

హైదరాబాద్ ఓల్డ్ సిటీ వెళ్లాను.. జనం ఎక్కడ.. వీడియో షేర్ చేసిన సీపీ

రంజాన్ షాపింగ్ కోసం పాతబస్తీలో జనం కిటకిటలాడిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓల్డ్ సిటీలో ప్రజలు ఎవరూ కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయి.

Samayam Telugu 15 May 2021, 8:47 am
తెలంగాణ వ్యాప్తంగా గత నాలుగురోజులుగా లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలకు అనుమతి ఇస్తున్నారు. అయితే హైదారబాద్ పాతబస్తీలో మాత్రం లాక్ డౌన్ అమలు కావడం లేదని ఆరోపణలు వచ్చాయి. అటు హైకోర్టు కూడా ఇదే విషయాన్ని లాక్ డౌన్‌కు ముందే ప్రశ్నించింది. పాతబస్తీలో కరోనా నిబంధనలు పాటించడం లేదని హైకోర్టు పేర్కొంది.
Samayam Telugu ఓల్డ్ సిటీలో రంజాన్ షాపింగ్


అటు రంజాన్ పండగ సందర్భంగా జనంతో కిక్కిరిసి ఉన్న పాతబస్తీ వీధులకు సంబంధించిన వీడియోలు సైతం హల్ చల్ చేశాయి. పాతబస్తీ ప్రాంతంలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి . శుక్రవారం రంజాన్ సందర్భంగా పాతబస్తీ వాసులు షాపింగ్ ఇతర కార్యకలాపాల కోసం రోడ్లపైకి వస్తున్నారు. ఆ ప్రాంతంలో దుకాణాలు సైతం కొన్నిచోట్ల తెరచి ఉంచారు.

పాతబస్తీలో లాక్‌డౌన్‌ రూల్స్ పాటించడం లేదని మీడియాలో కథనాలు వైరల్ అవ్వడంతో ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ అంజని కుమార్ పరోక్షంగా స్పందించారు. రంజాన్ రోజు‌న ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. ఏ గల్లీలో కూడా నలుగురు గుమిగూడి ఎక్కడ కనిపించలేదన్నారు. పౌరులంతాచట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పండగ రోజున సైతం లాక్ డౌన్ రూల్స్ పాటించిన ఓల్డ్ సిటీ వాసులకు సీపీ అంజనీ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని.. మరి మీకు అంటూ సీపీ అంజనీ కుమార్ నెటిజన్లకు ప్రశ్న వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.