యాప్నగరం

రాజస్థాన్‌లో ఉండి Hydలో మోసాలు.. వీటికి టెంప్ట్ అయ్యారో ఇక అంతే..

Hyderabad: ఈ ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడుతున్నది రాజస్థాన్‌కు చెందిన ముఠా అని పోలీసులు గుర్తించారు. దీంతో సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

Samayam Telugu 21 Jan 2021, 9:30 pm
ఓఎల్ఎక్స్‌లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఓఎల్ఎక్స్‌లో తక్కువ ధరకే టూ వీలర్, ఫోర్ వీలర్, ఖరీదైన ఫోన్లకు సంబంధించిన ఫోటోలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. వీటికి ఆకర్షితులైన వారిని వలలో వేసుకుంటున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఓఎల్ఎక్స్‌లో మోసపోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు 20 కి పైగా కేసులు నమోదు కావడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu పట్టుబడ్డ నిందితులు
Olx fraud in hyderabad


అయితే ఈ ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడుతున్నది రాజస్థాన్‌కు చెందిన ముఠా అని పోలీసులు గుర్తించారు. దీంతో సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే రాజస్థాన్ పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసే క్రమంలో నిందితుల ముఠా, గ్రామస్తులు పోలీసులపై దాడులు చేశారు. రెండు పోలీసు వాహనాలను కూడా గ్రామస్తులు, ముఠా సభ్యులు ధ్వంసం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్ జిల్లా నగ్లా గ్రామానికి చెందిన ఏడుగురు ముఠా సభ్యులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు అసదుద్దీన్, యాసీన్, అలీ మొహమ్మద్, అక్తర్ ఖాన్, సద్దాం ,షోయాబ్, సద్దాంలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.