యాప్నగరం

యూఎస్ టూ హైదరాబాద్ డ్రగ్స్ స్మగ్లింగ్.. రూ.2.36 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎలా చిక్కారంటే ?

Drugs: ఇంటర్నేషనల్ డ్రగ్స్ (Drugs) స్మగ్లింగ్ రాకెట్‌ను డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు పట్టుకున్నారు. డార్క్‌వెబ్ (Dark Web) ద్వారా అమెరికా నుంచి ఇండియాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అందిన సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు దాడులు నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించిన అధికారులు 5.3 కిలోల హైడ్రోపోనిక్ వీడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.36 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 4 Oct 2022, 11:03 am
Drugs: ఇంటర్నేషనల్ డ్రగ్స్ (Drugs) స్మగ్లింగ్ రాకెట్‌ను డీఆర్ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించిన అధికారులు 5.3 కిలోల హైడ్రోపోనిక్ వీడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.36 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu drugs new
హెదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డార్క్‌వెబ్ (Dark Web) ద్వారా అమెరికా నుంచి ఇండియాకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు అందిన సమాచారం మేరకు డీఆర్‌ఐ అలెర్ట్ అయింది. హైదరాబాద్ (Hyderabad), ముంబై (Mumbai), ఢిల్లీ (Delhi) అధికారులు సమన్వయంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ పార్శిళ్లు చేరే ముంబైలోని పోస్టాఫీస్‌లో (Post Office) అధికారులు సోదాలు నిర్వహించారు.

యూఎస్ నుంచి హైదరాబాద్‌ చిరునామాతో వచ్చిన ఓ పార్శిల్‌పై ఫుడ్‌ ఐటెమ్స్‌ అని రాసి ఉండటాన్ని అధికారులు గమనించారు. అనుమానంతో పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో 3.5 కేజీల హైడ్రోపోనిక్‌ వీడ్‌ బయటపడింది. వెంటనే ముంబై అధికారులు హైదరాబాద్‌ అధికారులను అప్రమత్తం చేశారు. అలెర్ట్ అయిన హైదరాబాద్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.

డార్క్‌వెబ్‌ ద్వారా ఆర్డర్‌ ఇచ్చి, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిజానికి ఈ పార్శిల్‌ ఢిల్లీ చేరాల్సి ఉందని., ఇప్పటికే ఓ పార్శిల్‌ అక్కడికి చేరిందని నిందితులు అధికారులకు వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు ఢిల్లీలోనూ సోదాలు నిర్వహించి ఓ పార్శిల్‌లో 1.8 కేజీల హైడ్రోపోనిక్‌ వీడ్‌ స్వాధీనం చేసుకున్నారు.
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.